పరామర్శకు వెళ్లి.. పాడు పని!.. మంత్రి అనిల్ అనుచరులేనంటూ ప్రచారం
ABN , First Publish Date - 2021-09-07T08:05:24+05:30 IST
వారంతా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తమ నేతను పరామర్శించేందుకు వెళ్లారు.
- వ్యభిచార గృహంలో పట్టుబడ్డ నెల్లూరు విటులు
- ఏపీ మంత్రి అనిల్ అనుచరులేనంటూ ప్రచారం
నెల్లూరు (క్రైం), హైదరాబాద్ సిటీ/మాదాపూర్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వారంతా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తమ నేతను పరామర్శించేందుకు వెళ్లారు. ఆ పని అయ్యాక.. ఓ వ్యభిచార గృహంలోకి వెళ్లి పోలీసు దాడుల్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మదాపూర్లోని హవెన్ స్పా బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ నెల 3న పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 23 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. విటుల్లో నెల్లూరు నగరానికి చెందిన ఐదుగురు ఉన్నారు. బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన నాగుర్ నాగార్జునరెడ్డి, నిమ్మల శ్రీనివాసులు, జేపీ రెసిడెన్సీకి చెందిన సన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి, లీలా ప్యాలె్సకు అపార్ట్మెంట్లో ఉంటున్న కోడూరు హరిరెడ్డి, ఏసీ నగర్కు చెందిన తోట వినీల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఐదుగురు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరులేనంటూ నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిందితులను తదుపరి దర్యాప్తు నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. మాదాపూర్ దుర్గంచెరువు-జూబ్లీహిల్స్ రోడ్డులో ఎనిమిదేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా క్రికెట్ బెట్టింగ్లకు కూడా పాల్పడుతోందని, ఏపీలో కొన్ని కేసులు ఉన్నట్లు తెలిసింది..