ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు
ABN , First Publish Date - 2021-11-11T23:12:55+05:30 IST
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ముగిసింది. 15 స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ముగిసింది. 15 స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ 11, ఎంఐఎం 7 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య 9-6 చొప్పున ఒప్పందం కుదిరింది. 15 స్థానాలను ఏకగ్రీవం దిశగా టీఆర్ఎస్-ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రూటినీ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. శుక్రవారం స్క్రూటినీ అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 15 స్థానాలను టీఆర్ఎస్, ఎంఐఎం ఒప్పందం ప్రకారం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.