మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంకు జరిమానా
ABN , First Publish Date - 2021-10-28T23:28:41+05:30 IST
మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. ఇటీవల హైటెక్స్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా..

హైదరాబాద్: మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. ఇటీవల హైటెక్స్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన జీహెచ్ఎంసీ నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్కు రూ.30 వేలు, మంత్రి తలసానికి రూ. 5 వేలు జరిమానా విధించింది. ప్లీనరీ కోసం సిటీ మొత్తం ఫ్లెక్సీలు వెలిశాయి. గత 5 రోజులుగా జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సర్వర్ పనిచేయడం లేదని అధికారులు చెప్పారు. ప్రజల ఆగ్రహం నేపథ్యంలో ఎట్టకేలకు తూతూ మంత్రంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.