ఆదివాసీలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: గెడం నగేష్
ABN , First Publish Date - 2021-08-10T23:07:04+05:30 IST
ఆదివాసీలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ మాజీ ఎంపీ గెడం నగేష్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆదివాసీలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ మాజీ ఎంపీ గెడం నగేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మరని గెడం నగేష్ చెప్పారు.