ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శిగా వంశీచంద్ రెడ్డి
ABN , First Publish Date - 2021-10-27T08:16:05+05:30 IST
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి పార్టీలో కీలక పదవి లభించింది. ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి పార్టీలో కీలక పదవి లభించింది. ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఆయన ఇకపై పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహాయకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతో మంగళవారం వేణుగోపాల్ ఉత్తర్వుల ను జారీ చేశారు.