‘బాణాపూర్ అడవిలో ఎలాంటి కాల్పులు జరగలేదు’
ABN , First Publish Date - 2021-01-17T23:40:37+05:30 IST
యాలాల మండలం బాణాపూర్లో బుల్లెట్ల కలకలంపై జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాదవరావు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ నుండి కొందరు వేటకు
వికారాబాద్: యాలాల మండలం బాణాపూర్లో బుల్లెట్ల కలకలంపై జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాదవరావు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ నుండి కొందరు వేటకు వస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం ఉందని, తాము వారిని గుర్తించేలోపే వారు పారిపోయారని తెలిపారు. మొదట అక్కడ తమకు ఎలాంటి బుల్లెట్లు లభించలేదని, స్థానికులు వాటిని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. బాణాపూర్ అడవిలో ఎలాంటి కాల్పులు జరగలేదని, అడవిలో వేట జరగకుండా తమ సిబ్బంది గట్టి నిఘా పెట్టారని తెలిపారు. ఎక్కువగా హైదరాబాద్ నుండే ఇక్కడికి వేటకు వస్తున్నారని వేణుమాదవరావు చెప్పారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని బాణాపూర్ అటవీ ప్రాంతంలో ఓ బుల్లెట్ మ్యాగ్జిన్ లభ్యమైన విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం ఓ పశువుల కాపరి తనకు దొరికిన ఈ మ్యాగ్జిన్ను సర్పంచ్ శేఖర్కు ఇచ్చాడు. ఆయన దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అక్కడినుంచి అది యాలాల పోలీసులకు వద్దకు చేరింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అటవీప్రాంతంలో రాత్రివేళల్లో కొందరు వ్యక్తులు జంతువులను వేటాడటానికి వస్తున్నారని, ఆ మ్యాగ్జిన్ వాళ్లదే అయి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.