ఎర్రబెల్లికి చుక్కలు చూపించిన ఫీల్డ్ అసిస్టెంట్లు: విజయశాంతి
ABN , First Publish Date - 2021-06-20T11:03:32+05:30 IST
వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి) : వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగాల నుంచి తొలగించడంతో వారు రోడ్డునపడ్డారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.