పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

ABN , First Publish Date - 2021-10-29T08:13:44+05:30 IST

పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఓ రైతన్న ప్రాణాలతో పోరాడి ఓడిపోయారు.

పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

శాయంపేట, అక్టోబరు 28: పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఓ రైతన్న ప్రాణాలతో పోరాడి ఓడిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామానికి చెందిన భయ్యగాని సత్యనారాయణ(58) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దిగుబడి సరిగా రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ.. బుధవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు  ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.  

Updated Date - 2021-10-29T08:13:44+05:30 IST