మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు 21న పరీక్ష
ABN , First Publish Date - 2021-08-14T07:48:18+05:30 IST
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడల్ స్కూల్ డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్)కు దరఖాస్తు చేసుకునే గడువును పెంచారు. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు శుక్రవారం తెలిపారు.