బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే..నీ బిడ్డ ఎందుకు గెలువలేదు?

ABN , First Publish Date - 2021-07-24T08:04:23+05:30 IST

‘నాకు బంగారు పల్లెంలో పెట్టి అన్నీ ఇచ్చినం అని అంటున్నారు.. మరి నీ బిడ్డకు నాలాగే బీ ఫామ్‌ ఇచ్చావు కదా.. ఆమె ఎదుందుకు గెలువలేదు’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. సీఎం

బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే..నీ బిడ్డ ఎందుకు గెలువలేదు?

సీఎం కేసీఆర్‌నుద్దేశించి ఈటల వ్యాఖ్యలు 

జమ్మికుంట, జూలై 23: ‘నాకు బంగారు పల్లెంలో పెట్టి అన్నీ ఇచ్చినం అని అంటున్నారు..  మరి నీ బిడ్డకు నాలాగే బీ ఫామ్‌ ఇచ్చావు కదా.. ఆమె ఎదుందుకు గెలువలేదు’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల నుంచి ఈటల ప్రజాదీవెన పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క కేసీఆర్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, తన లాంటి వాళ్లు ఉద్యమం నడిపారు కాబట్టే అది సాధ్యమయిందన్నారు. ఒళ్లు వంచి కష్టపడి పని చేసి ప్రజలను కాపాడుకుంటే నాయకులుగా ఎదుగుతామనే విషయం మర్చిపోవద్దన్నారు. కేసీఆర్‌ ఎన్నిరకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఓటుకు 10 వేలు ఇచ్చినా నాయకులు, ప్రజా ప్రతినిధులకు వెల కట్టినా చివరకు ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది మాత్రం తానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-24T08:04:23+05:30 IST