ఐఐటీహెచ్లో 22, 24 తేదీల్లో ‘ఈ-సమ్మిట్’
ABN , First Publish Date - 2021-01-12T09:22:34+05:30 IST
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్లో ఈ నెల 22, 24 తేదీల్లో ‘ఈ-సమ్మిట్-2021-ఏ ప్రాగ్మాటిక్ అడ్వెంట్’ను నిర్వహించనున్నారు

కంది, జనవరి 11 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్లో ఈ నెల 22, 24 తేదీల్లో ‘ఈ-సమ్మిట్-2021-ఏ ప్రాగ్మాటిక్ అడ్వెంట్’ను నిర్వహించనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఆంత్రప్రెన్యూర్ సమావేశాల్లో ఒక్కటైన ఈ-సమ్మిట్-2021 విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ, కార్పొరేట్ వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తుంది. దేశ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఐఐటీహెచ్ వర్గాలు తెలిపాయి.