ఈటల పాదయాత్ర
ABN , First Publish Date - 2021-07-11T03:19:20+05:30 IST
రెండు, మూడు రోజుల్లో తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు
కరీంనగర్: రెండు, మూడు రోజుల్లో తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో గల గోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఈటల పేర్కొన్నారు. మఫ్టీ పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఒంటరిగా బరిలోకి దిగనన్నారు. ప్రజాస్వామిక వాదుల అండతో తాను పోటీచేస్తున్నానని ఆయన తెలిపారు. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఆయన ఘాటుగా విమర్శించారు.
రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్లో హరీష్ రావు బేరసారాలు మాట్లాడుతున్నారన్నారు. ఆర్డీవో ఆధ్యర్యంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. మంత్రులు కల్లు తాగిన కోతుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. మహిళా ఎంపీడివోను ఒక మంత్రి అలా అనొచ్చా అని ఆయన ప్రశ్నించారు.