తెలంగాణలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-20T00:30:16+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో ప్రారంభించాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్థులను స్కూళ్లకు పంపాలా, వద్దా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికి కేబినెట్ వదిలేసింది. విద్యార్థులు తప్పనిసరిగా స్కూళ్లకు రావాలని యాజమాన్యాలు బలవంతపెట్టకూడదని కేబినెట్ ఆదేశించింది. పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్లైన్ తరగతుల్లో హాజరుకావచ్చని కేబినెట్ సూచించింది. విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.