మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన ఈ పంచాయితీ ఆపరేటర్స్ అసోసియేషన్ నేతలు
ABN , First Publish Date - 2021-04-16T20:21:57+05:30 IST
ఈ పంచాయితీ అవార్డ్ రావడం పట్ల తెలంగాణ ఈ పంచాయితీ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి కి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ఈ పంచాయితీ అవార్డ్ రావడం పట్ల తెలంగాణ ఈ పంచాయితీ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సంఘ బాధ్యులు మంత్రి ఎర్రబెల్లిని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం పొంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పంచాయితీ పురస్కార్ సాధించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని తెలంగాణ ఈ ఆపరేటర్స్ అసోసియేషన్(టీఈ-పీఓఏ) బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వారి సమస్యలను కూడా వారు మంత్రికి చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారు.మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మడికొండ రాజ్ కుమార్, నాగి రాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ శానగొండ రమేష్ ఇతర జిల్లాల ఈ పంచాయితీ ఆపరేటర్లు తదితరులు వున్నారు.