యాదాద్రిక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-08T02:09:26+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి పురస్కరించుకొని గురువారం దేవీ శరన్నవరాత్రి

యాదాద్రిక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి పురస్కరించుకొని గురువారం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు శైవాగమ పద్ధతిలో శ్రీకారం చుట్టారు. కొండపైన శివాలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నందున చరమూర్తులు కొలువుదీరిన ఉపాలయంలో నవరాత్రి పర్వాలను నిర్వహించారు. చరమూర్తులకు నిత్య పూజలు నిర్వహించిన అర్చకులు దుర్గా అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. విఘ్నేశ్వరుడికి తొలి పూజలతో మహోత్సవ పర్వాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని కొలుస్తూ నవావరణ పూజలు చేసి సహస్రనామార్చనలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు.

Updated Date - 2021-10-08T02:09:26+05:30 IST