జానారెడ్డి గెలవాలని కాంగ్రెస్ నేతలకే లేదు!
ABN , First Publish Date - 2021-04-16T09:32:57+05:30 IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలవాలని కాంగ్రెస్ నాయకులకే లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు కుమారులతో జానారెడ్డికి సమస్య ఉండగా,
ఆ పార్టీ అధిష్ఠానం బలవంతంగా టికెట్ ఇచ్చింది: గుత్తా
నల్లగొండ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలవాలని కాంగ్రెస్ నాయకులకే లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు కుమారులతో జానారెడ్డికి సమస్య ఉండగా, కాంగ్రె్సలోని కొందరు మరింత సమస్యగా మారారని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం గుత్తా సుఖేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. జానారెడ్డి గెలిస్తే తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కదని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భావిస్తున్నారని, నాలుగు రోజుల పాటు అలిగిన ఉత్తమ్.. ఇప్పుడు మళ్లీ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బలవంతంగా టికెట్ కట్టబెట్టిందని జానారెడ్డే స్వయంగా తనకు చెప్పారని, ఇప్పటికైనా ఆయన పోటీ నుంచి విరమించుకుంటే మంచిదన్నారు.