ఏటిగడ్డకిష్టాపూర్ రైతులను ఖాళీ చేయించొద్దు
ABN , First Publish Date - 2021-06-22T08:10:59+05:30 IST
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏటిగడ్డకిష్టాపూర్ రైతులకు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబరు 6వరకు పొడిగించింది.
![ఏటిగడ్డకిష్టాపూర్ రైతులను ఖాళీ చేయించొద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సెప్టెంబరు 6వరకు ఆదేశాలు పొడిగించిన హైకోర్టు
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏటిగడ్డకిష్టాపూర్ రైతులకు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబరు 6వరకు పొడిగించింది. పూర్తి పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేసేదాకా భూముల్లోకి చొరబడరాదని, బలవంతంగా ఖాళీ చేయించరాదని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు, రిప్లయ్ కౌంటర్లు వేయాలని వాది, ప్రతివాదులను సీజే హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశించింది.