గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-17T06:10:29+05:30 IST
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గిర్మాజిపేట, అక్టోబరు 16 : వరంగల్ రైల్వేగేటు సమీపంలో ఏడు మోరీలు ప్రాంతంలో శనివారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (48) ఆత్మహత్య చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ జి.నరేష్ తెలిపారు. మృతుడు ఎరుపు రంగు శరీరం, కోల ముఖం, నలుపు, తెలుపు తల వెంట్రుకలు, మెడలో తెల్లని దారం, కుడిచేతికి స్టీలు కడెం, రుద్రాక్ష దండ ధరించి ఉన్నాడని, కుడి చేతిపై హనుమంతుడి చిత్రం పచ్చబొట్టు ఉందని సీఐ తెలిపారు. మృతదేహాన్ని ఎంజిఎం మార్చురీలో భద్రపరిచి ఎస్సై చింతా పరశురాములు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వృద్ధురాలు..
ఏల్గూరు-చింతల్పల్లి రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం ఖమ్మం నుంచి వరంగల్ వస్తోన్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గుర్తు తెలియని వృద్ధురాలు (65) మృతిచెందినట్లు జీఆర్పీ సీఐ జి.నరేష్ శనివారం తెలిపారు. మృతురాలు 4.5 అడుగుల ఎత్తు, పొట్టపై పుట్టుమచ్చ ఉందని, ఎరుపు రంగు శరరం, మల్టీకలర్ చీర, పింక్ కలర్ జాకెట్ ధరించి ఉందని, మృతురాలి వద్ద చిల్లర నాణాలు దొరకటంతో మృతురాలు యాచకురాలుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఎస్సై చింతా పరశురాములు కేసు దర్యాపు చేస్తున్నారన్నారు.