సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త సీపీ ఎవరంటే..!
ABN , First Publish Date - 2021-08-25T20:06:49+05:30 IST
సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్గా సేవలు అందించిన సజ్జనార్ను

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్గా సేవలు అందించిన సజ్జనార్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్గా 1999 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను నియమిస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
కీలకమైన కేసులను పరిష్కరించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి సజ్జనార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్తో సజ్జనార్ ఒక్కసారిగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్కౌంటర్తోనూ ఆయన గుర్తింపు పొందారు. సజ్జనార్ 1996 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. కీలకమైన కేసులను కూడా పరిష్కరించిన ఐపీఎస్గా సజ్జనార్కు పేరుంది.