హైదరాబాద్ కమిషనర్గా సీవీ ఆనంద్
ABN , First Publish Date - 2021-12-25T07:19:11+05:30 IST
రాష్ట్రంలో భారీగా ఐపీఎ్సల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం
![హైదరాబాద్ కమిషనర్గా సీవీ ఆనంద్](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122501465233/12252021014757n3.jpg)
- ఏసీబీ చీఫ్గా అంజనీ కుమార్
- ఏసీబీ డైరెక్టర్గా శిఖా గోయల్
- వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిడ్
- 30 మంది ఐపీఎస్ల బదిలీ
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీగా ఐపీఎ్సల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న బదిలీలను ప్రభుత్వం ఎట్టకేలకు చేపట్టింది. తెలంగాణ పోలీ్సలో అత్యంత కీలక విభాగాల్లో ఒకటైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల క్రితం వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆనంద్ను తిరిగి సొంత కేడర్కు పిలిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత... కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లిన సీవీ ఆనంద్కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే వెనక్కి వచ్చారు. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ కొత్వాల్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గతంలో ట్రాఫిక్ బాస్గా పని చేసిన సీవీ ఆనంద్కు హైదరాబాద్పై పూర్తి పట్టుంది.
హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీ కుమార్కు ఏసీబీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. అడిషనల్ సీపీ(క్రైం) శిఖా గోయల్ ఏసీబీ డైరెక్టర్గా నియమితులయ్యారు. సిద్దిపేట కమిషనర్ గా ఉన్న జోయల్ డేవిడ్ను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ డీసీపీగా ప్రభుత్వం నియమించింది.
![](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122501465233/12252021014826n49.jpg)
హైదరాబాద్ కమిషనరేట్లో డీసీపీ(డీడీ)గా ఉన్న అవినాష్ మహంతికి సైబరాబాద్ కమిషనరేట్ జాయింట్ సీపీ(అడ్మిన్)గా పోస్టింగ్ ఇచ్చింది. సీనియర్ ఐపీఎ్సలతో పాటు ఇటీవల ఐపీఎ్సలుగా కన్ఫర్డ్ అయిన పోలీస్ అధికారులు కూడా ప్రస్తుత బదిలీల్లో ఉన్నారు.
![](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122501465233/12252021014844n41.jpg)
![](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122501465233/12252021014904n85.jpg)