రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పరిశీలించిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2021-05-08T22:35:53+05:30 IST

రాష్ట్రంలో ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.

రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పరిశీలించిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ఈమేరకు గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో జరుగుతన్న తీరును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో పాటు రెండో విడత వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారితో ఆయన ముచ్చటించారు. సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌కు చేసిన ఏర్పాట్లు బాగుతన్నాయని ఇక్కడికి వచ్చిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 


వ్యాక్సిన్‌ ప్రక్రియకు 15 నిమిషాలు, మరో 30 నిమిషాలు అబ్జర్వేషన్‌ ఉంటున్నారు. దీంతో దాదాపు 40 నుంచి 45 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతోందని చెప్పారు.ఈనెల 10 నుంచి 12వ తేదీల్లో ఏ ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చని సీఎస్‌ పేర్కొన్నారు. త్వరలో 100 బెడ్స్‌, ఆక్సీజన్‌ సప్లయ్‌ అవుతుతందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ఆస్పత్రిలో మరొ 120 బెడ్స్‌ అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. 

Updated Date - 2021-05-08T22:35:53+05:30 IST