రోగులను పరామర్శించిన సీఎంపై విమర్శలా?

ABN , First Publish Date - 2021-05-24T10:56:32+05:30 IST

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులను సీఎం కేసీఆర్‌ పరామర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విమర్శించడం బాధ్యతా రాహిత్యమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

రోగులను పరామర్శించిన సీఎంపై విమర్శలా?

విపక్షాల తీరు బాధ్యతారాహిత్యం: శ్రీనివా్‌సగౌడ్‌

మహబూబ్‌నగర్‌, మే 23: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులను సీఎం కేసీఆర్‌ పరామర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విమర్శించడం బాధ్యతా రాహిత్యమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్‌ చేశారని, గాంధీ, వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం కల్పించారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో కరోనా రోగుల కోసం ఇంతకన్నా మెరుగైన చర్యలు ఏం తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-05-24T10:56:32+05:30 IST