ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం

ABN , First Publish Date - 2021-10-29T05:03:15+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం

ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
మహాసభలో మాట్లాడుతున్న నాగయ్య

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య


దుగ్గొండి, అక్టోబరు 28: ప్రజల సమస్యలు పరిష్కరించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీ ఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య విమర్శించారు. గిర్నిబావిలో గురువారం సీపీఎం ద్వితీయ మహాసభ పుచ్చ కాయల కృష్ణారెడ్డి, చెల్పూరి మొగిలి అధ్యక్షతన నిర్వహిం చగా ముఖ్యఅతిథిగా నాగయ్య మాట్లాడారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో అందరూ ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు పెరిగిపోయా యని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలు చేయాలన్నారు. కార్యకర్తలు చేసి సీపీ ఎంను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో నాయకుడు పుచ్చకాల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి చింత మల్ల రంగయ్య, మండల కార్యదర్శి ఈసంపల్లి బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, హన్మ కొండ శ్రీధర్‌, నమిండ్ల స్వామి, భూక్య సమ్మయ్య, చల్లా నర్సింహారెడ్డి, కోడెం రమేశ్‌, ఓదెలు, మొగిలి, నర్సింహ స్వామి, బోళ్ల సాంబయ్య, భాస్కర్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:03:15+05:30 IST