113 టెస్టులు.. నో పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-01-20T05:05:47+05:30 IST
113 టెస్టులు.. నో పాజిటివ్ కేసులు
ములుగు, జనవరి 19: ములుగు జిల్లాలో మంగళవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 18 ఆస్పత్రులలో 113 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ టీకా వేయిస్తున్నామని తెలిపారు.