కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు కరోనా
ABN , First Publish Date - 2021-10-29T08:33:28+05:30 IST
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజులుగా

టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరు అనంతరం అస్వస్థత
హైదరాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఎమ్మెల్యే బుధవారం పరీక్ష చేయించుకోగా వైరస్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచనతో హైదరాబాద్లోని ఇంట్లో ఐసొలేషన్లో ఉన్నారు. విద్యాసాగర్రావు.. ఇటీవలి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యారు కాగా, గురువారం 38,373 మందికి పరీక్షలు చేయగా 171 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైర్సతో మరొకరు మృతి చెందారు.