అనాధాశ్రమాలపై కరోనా దెబ్బ
ABN , First Publish Date - 2021-05-21T20:59:46+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ దెబ్బ అనాథశ్రామాలపై పడింది. డొనేషన్స్ రాకపోవడంతో ...

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ దెబ్బ అనాథశ్రామాలపై పడింది. డొనేషన్స్ రాకపోవడంతో నిర్వహణ ఖర్చు భరించలేక, చూస్తూ.. చూస్తూ.. పిల్లలను బయటకు వదిలేయలేక, వారి అవసరాలు తీర్చలేక నిర్వాహకులు తల్లఢిల్లిపోతున్నారు. హైదరాబాద్లో దాదాపు 5 వందల వరకు రిజిస్టర్డ్ అనాథాశ్రమాలు ఉన్నాయి. పిల్లల సంఖ్య వేలల్లో ఉంది. గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పుడు మొదలైన కష్టాలు సెకండ్ వేవ్తో మరింత పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు అష్ట కష్టాలుపడి నెట్టుకొచ్చినా.. ఇప్పుడంతా అయోమయంగా ఉందంటున్నారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడం, వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందంటున్నారు. ఇలాంటి సమయంలోనైనా ప్రభుత్వం, సినిమా యాక్టర్స్ ఎవరైనాసరే చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలను సందర్శించి కొంత సహాయం చేస్తే బాగుంటుందని నిర్వాహకులు కోరుతున్నారు.