ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందే: షర్మిల
ABN , First Publish Date - 2021-05-22T01:46:05+05:30 IST
ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. చికిత్స కోసం యశోదకు..
హైదరాబాద్: ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. చికిత్స కోసం యశోదకు.. పబ్లిసిటీ కోసం గాంధీకా? అంటూ సీఎం కేసీఆర్ను షర్మిల ప్రశ్నించారు. దొర గారూ.. ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. తెలంగాణలో 10 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలు అప్పులపాలయ్యారని, కేసీఆర్ అసమర్థత, చేతగాని తనమే కారణమని తప్పుబట్టారు. అప్పుల పాలైన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని, డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరూ అధైర్య పడొద్దు.. అందరికీ తాను అండగా ఉంటానని షర్మిల ప్రకటించారు.