ములుగు జిల్లాలో ఆరుగురికి కరోనా వైరస్
ABN , First Publish Date - 2021-01-19T04:38:37+05:30 IST
ములుగు జిల్లాలో ఆరుగురికి కరోనా వైరస్
ములుగు, జనవరి 18: ములుగు జిల్లాలో కొత్తగా ఆరుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. సోమవారం 208 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా, ములుగు మండలంలో ఒకరికి, ఏటూరునాగారంలో ఒకరికి, వెంకటాపురం(నూగూరు)లో ఒకరికి, గోవిందరావుపేటలో ఒకరికి, మంగపేట మండలంలో ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 5191కి పెరిగింది.