ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా
ABN , First Publish Date - 2021-01-14T04:00:46+05:30 IST
ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా
![ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ములుగు, జనవరి 13: ములుగు జిల్లాలో మరో ఇద్దరు కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం 180 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా, ములుగు మండలంలో ఒకరికి, మంగపేట మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 5178కి పెరిగింది.