మా గ్రామాలను తెలంగాణలో కలపండి

ABN , First Publish Date - 2021-02-06T06:08:59+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేవని.. వాటిని తెలంగాణలో కలపాలని ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల గిరిజన రైతులు కోరారు.

మా గ్రామాలను తెలంగాణలో కలపండి

నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌కు మహారాష్ట్ర గిరిజన రైతుల వినతి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేవని.. వాటిని తెలంగాణలో కలపాలని ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల గిరిజన రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కేంద్రమైన నాందేడ్‌కు తాము 300కి.మీదూరంలో ఉన్నామని, అందువల్ల తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో భాషా ప్రాతిపాదిక రాష్ట్రాల ఏర్పాటుతో మహారాష్ట్రలో కలిసిన  తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రపతిని కలిసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

Updated Date - 2021-02-06T06:08:59+05:30 IST