కాంగ్రెస్ మండల అధ్యక్షుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-22T05:49:23+05:30 IST
కాంగ్రెస్ మండల అధ్యక్షుడి ఆత్మహత్య
గోవిందరావుపేట, ఏప్రిల్ 21: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, పస్రా గ్రామానికి చెందిన ధర్మ అంజిరెడ్డి(55) మంగళవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక, కుటుంబ పరమైన సమస్యలతో తీవ్ర మనస్తా పానికి గురైన ఆయన బలవన్మరణానికి పాల్ప డ్డారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన అంజి రెడ్డి సౌమ్యుడిగా అందరికీ సుపరిచితుడు. ఆయన హఠాన్మరణంతో పార్టీ వర్గాలు, మిత్రులు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. పస్రాలో ఆయన అంత్యక్రియలు బుధవారం జరిగాయి. మృతదేహాన్ని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క సందర్శించి నివాళులు అర్పించారు. అంజి రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టారు. అంజిరెడ్డికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కుండపట్టి అంతిమ సంస్కా రాలు జరిపించారు. అంజిరెడ్డి మృతితో మండలంలో విషాదం అలుముకుంది.