ఈటల అవినీతిలో టీఆర్ఎస్కూ భాగస్వామ్యం
ABN , First Publish Date - 2021-10-22T23:27:02+05:30 IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిలో టీఆర్ఎస్కూ
హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిలో టీఆర్ఎస్కూ భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్ ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగతున్న ఉప ఎన్నికలు దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికలుగా మారాయన్నారు. దేశంలో ఇంత ఖరీదైన ఉపఎన్నిక ఎప్పుడూ చూడలేదని మహేష్కుమార్ అన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నాయని ఆయన ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలి కొదిలేశారని మహేష్ విమర్శించారు.