రాజకీయాలు దూషణలకే పరిమితమవుతున్నాయి: గీతారెడ్డి
ABN , First Publish Date - 2021-12-15T21:52:21+05:30 IST
ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నాయని

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నాయని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అపారమైన అనుభవం రోశయ్య సొంతమన్నారు. రోశయ్య మరణం రాజకీయాలకే తీరని లోటని ఆమె పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు ఎంతో యాక్టివ్గా ఉండేవారన్నారు. రోశయ్య మంత్రివర్గంలో పని చేయడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు.