రాజ్భవన్ చేరిన సీజేఐ.. ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ABN , First Publish Date - 2021-06-12T00:21:51+05:30 IST
రాజ్భవన్ చేరుకున్న సుప్రీం సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి..
హైదరాబాద్: రాజ్భవన్ చేరుకున్న సుప్రీం సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన రాజ్భవన్ వెళ్లారు. రాజ్భవన్లో సీజేఐకు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన రాక కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయన 3 రోజుల పాటు రాజ్భవన్ అతిథి గృహంలో ఉండనున్నారు.