అనుమతి లేని అనాధ శరణాలయాలపై కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-10-30T21:15:07+05:30 IST
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహించే అనాధ శరణాలయాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మాతా, శిశు సంక్షేమశాఖ అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహించే అనాధ శరణాలయాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మాతా, శిశు సంక్షేమశాఖ అధికారులు హెచ్చరించారు. బాలల న్యాయ చట్టం-2015 ప్రకారం 18 సంవత్సరాలలోపు బాల బాలికలకు ఆశ్రయం కల్పిస్తున్న శరణాలయం, స్వచ్చంద సంస్థ తప్పని సరిగా మహిళా శిశు సంక్షేమవాఖ నుంచి రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ పొందాల్సి వుంటుందన్నారు. పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ రిజిస్ర్టేషన్ పొందని అనాధ శరణాలయం, స్వచ్చంద సంస్థ పై బాలల న్యాయ చట్టం (జువనైల్ జస్టిస్ యాక్ట్)-15, సెక్షన్ (42) ప్రకారం ఒక సంవత్సరం జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
కాబట్టి హైదరాబాద్ జిల్లాలో ఏదైనా అనాధ శరణాలయం బాలలకు ఆశ్రయం కల్పిస్తూ ఇప్పటి వరకూ రిజిస్ర్టేషన్ చేయించని వారు సంబంధిత మహిళా శిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ పొందాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.