యువతులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-11T21:31:37+05:30 IST
యువతులను మోసం చేస్తున్న వ్యక్తిని నగర
హైదరాబాద్: యువతులను మోసం చేస్తున్న షేక్ మహ్మద్ రఫీ అనే వ్యక్తిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్ వర్మ అనే మారుపేరుతో అతను విగ్గు పెట్టుకుని టిప్ టాప్గా కనిపిస్తూ 26 మంది యువతులను ట్రాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎన్నారై పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తనకు పరిచయమైన యువతులతో రఫీ సహజీవనం కూడా చేశాడు. ఆ యువతుల వ్యక్తిగత ఫొటోలు సంపాదించి వారిని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. తమకు అందిన ఫిర్యాదుతో ఎస్ఆర్నగర్ పోలీసులు షేక్ మహ్మద్ రఫీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.