‘జగతి’ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ

ABN , First Publish Date - 2021-10-29T08:14:08+05:30 IST

అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్‌ కేసుకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘జగతి’ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్‌ కేసుకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. గురువారమిక్కడ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై పూర్తి వివరాలు ేసకరించిన తర్వాత కౌంటర్‌ దాఖలు చేస్తున్నట్లు సీబీఐ నివేదించింది.  ఇదే కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి తదితర నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లపై కౌంటర్‌ దాఖలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టును మరింత సమయం కోరింది.  ఓఎంసీ కేసులో సబితా ఇంద్రారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. కాగా, జగన్‌ తన సంస్థలను లాభాలబాట పట్టిస్తాడని ఊహించే  పెట్టుబడులు పెట్టామని హెటిరో సంస్థ హైకోర్టుకు వెల్లడించింది. సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెటిరో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌ ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. జడ్చర్ల్ల సెజ్‌లో భూమిని కొనుగోలు చేయలేదని, లీజుకు మాత్రమే తీసుకున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-10-29T08:14:08+05:30 IST