పులి దాడిలో పశువులకాపరి మృతి
ABN , First Publish Date - 2021-10-29T08:13:21+05:30 IST
పులి పంజా విసిరి ఓ పశువుల కాపరిని పొట్టనబెట్టుకుంది. ఆవును కూడా గాయపరిచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి

మహదేవపూర్ రూరల్, అక్టోబరు 28: పులి పంజా విసిరి ఓ పశువుల కాపరిని పొట్టనబెట్టుకుంది. ఆవును కూడా గాయపరిచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సిరొంచా తాలూకా పెంటిపాక గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (50) అనే కాపరి పశువులను సమీప అడవికి తోలుకెళ్లాడు. ఆయనతో కలిసి మరో వ్యక్తి కూడా వెళ్లాడు. ఈ క్రమంలో చెట్ల మాటున ఉన్న పులి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. మల్లయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు.