HYD: 34,042 ట్రాఫిక్ ఉల్లంఘనులపై కేసులు
ABN , First Publish Date - 2021-12-26T13:06:04+05:30 IST
రాచకొండ కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ పీఎ్సల ప్రాంతాల్లో వారం (18.12.2021-24.12.2021) రోజుల్లో 34,042 మంది ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. నిబంధనల

జరిమానా రూ 1,37,28,710
హైదరాబాద్/కొత్తపేట:రాచకొండ కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ పీఎ్సల ప్రాంతాల్లో వారం (18.12.2021-24.12.2021) రోజుల్లో 34,042 మంది ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. నిబంధనల ఉల్లంఘనులకు రూ 1,37,28,710ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో వారంలో వంద రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, 15 మంది మృత్యువాత పడ్డారని, 85 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. తనిఖీల్లో పట్టుబడి, కోర్టుల్లో హాజరైన మందుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రాచకొండ ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.