కరాటే కళ్యాణిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-12-26T08:32:15+05:30 IST
సినీ సహనటి కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. గతంలో.. సైదాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలోని ఓ బాలికపై జరిగిన హత్య వివరాలను.

జీడిమెట్ల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సినీ సహనటి కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. గతంలో.. సైదాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలోని ఓ బాలికపై జరిగిన హత్య వివరాలను.. పేర్లు, ఫొటోతోసహా ఆమె వెల్లడించడంపై.. ఎల్లమ్మబండకు చెందిన తూటంశెట్టి నితీశ్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో.. కోర్టు ఆదేశాల మేరకు కళ్యాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.