రేషన్డీలర్పై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-08-26T05:17:10+05:30 IST
రేషన్డీలర్పై కేసు నమోదు

కాటారం, ఆగస్టు 25: మండలంలోని జాదరావుపేట రేషన్ డీలర్పై 6ఏ కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ డీటీ మల్లేషం బుధవారం తెలిపారు. రేషన్ డీలర్ కటుకు సతీ్షకుమార్ తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అవకతవకలపై విచారణ అనంతరం రేషన్ డీలర్ సతీ్షపె నమోదు చేసి తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.