జీహెచ్ఎంసీలో పదిమంది ఉద్యోగులకు కరోనా
ABN , First Publish Date - 2021-03-31T01:19:53+05:30 IST
హైదరాబాద్లో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.
హైదరాబాద్: హైదరాబాద్లో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో నగరంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీలోని ప్రధాన కార్యాలయంలో 3, 4, 5 అంతస్తుల్లో పని చేసే 10 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. అయితే జీహెచ్ఎంసీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఉద్యోగులు డ్యూటీకి రావాలంటేనే భయపడిపోతున్నారు.