జగిత్యాల జిల్లాలో ఒకరి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-02-26T08:16:54+05:30 IST
పాత కక్షల నేపథ్యంలో కుమార్తె ఎదుటే తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండిలో బుధవారం రాత్రి జరిగింది
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 25: పాత కక్షల నేపథ్యంలో కుమార్తె ఎదుటే తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండిలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బర్లపాటి రాజేశ్వర్ (42), పల్లె పోశెట్టిలకు కొంత కాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి పోశెట్టి, రాజేశ్వర్లు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆగ్రహించిన పోశెట్టి కత్తితో రాజేశ్వర్పై దాడికి దిగాడు. రాజేశ్వర్ పెద్ద కూతురు తన తండ్రిని ఏమీ చేయవద్దని ప్రాధేయపడినా పోశెట్టి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రాజేశ్వర్ను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.