మూడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం
ABN , First Publish Date - 2021-03-11T08:21:16+05:30 IST
నిర్మల్ జిల్లా భైంసా మండలంలో మూడేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు బుధవారం అత్యాచారం చేశాడు. చదువు మధ్యలో మానేసి గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న ఆ బాలుడు..
భైంసా రూరల్, మార్చి 10: నిర్మల్ జిల్లా భైంసా మండలంలో మూడేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు బుధవారం అత్యాచారం చేశాడు. చదువు మధ్యలో మానేసి గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న ఆ బాలుడు.. తన ఇంటి పక్కనే ఉండే బాలికపై ఆమె తల్లిదండ్రులెవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా ఏడవడంతో అక్కడి నుంచి ఆ బాలుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.