వేములవాడలో బాలుడి కిడ్నాప్ కలకలం
ABN , First Publish Date - 2021-03-24T15:00:48+05:30 IST
రాజన్న సిరిసిల్ల: వేములవాడలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి

రాజన్న సిరిసిల్ల: వేములవాడలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు దర్శనం నిమిత్తం వెళ్లారు. అనంతరం గుడి పార్కింగ్ స్థలంలో భోజనం చేస్తుండగా.. సరితా అనే మహిళ బాలుడి కిడ్నప్నకు యత్నించారు. గమనించిన బంధువులు ఆ మహిళను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మహిళను పోలీసులు విచారిస్తున్నారు.