మరో ముగ్గురు నిందితులను కస్టడీలోకి కోరిన పోలీసులు

ABN , First Publish Date - 2021-01-19T15:21:52+05:30 IST

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మరో ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం పోలీసులు..

మరో ముగ్గురు నిందితులను కస్టడీలోకి కోరిన పోలీసులు

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన మరో ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని  కోరారు. భూమా అఖిల ప్రియ డ్రైవర్ బాల చెన్నయ్య, పర్సనల్ సెక్రెటరీ మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లను వారం రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కస్టడీ పిటీషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది.

Updated Date - 2021-01-19T15:21:52+05:30 IST