గోదావరిలో వ్యక్తి గల్లంతు
ABN , First Publish Date - 2021-08-08T21:20:35+05:30 IST
భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు.
భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు. త్రివేణి సంగమం దగ్గర హస్తికలు కలిపేందుకు నీటిలో దిగి ఆరుగురు వ్యక్తులు మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు స్పందించి ఐదుగురిని కాపాడారు. వీరస్వామి అనే వ్యక్తి నదిలో గల్లంతయ్యాడు. అతని కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. వీరస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, రామన్న గూడెం.