దేశంలో పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కాంగ్రెసే శాశ్వతం : భట్టి

ABN , First Publish Date - 2021-11-09T18:29:07+05:30 IST

ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యక్తులు, నాయకులు వస్తుంటారు.. పోతుంటారని.. కానీ కార్యకర్తలే పార్టీకి ముఖ్యమన్నారు.

దేశంలో పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కాంగ్రెసే శాశ్వతం : భట్టి

హైదరాబాద్: ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యక్తులు, నాయకులు వస్తుంటారు.. పోతుంటారని.. కానీ కార్యకర్తలే పార్టీకి ముఖ్యమన్నారు. కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో భట్టి మాట్లాడుతూ.. ‘‘దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్. దేశంలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. గాంధీయిజమే కాంగ్రెస్ భావజాలం.. కాంగ్రెస్ సిద్ధాంతం. కొన్ని రాజకీయ పార్టీలు దేశంలో వస్తుంటాయి.. పోతుంటాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళు అధికారంలో లేకున్నా.. ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ జెండా మోస్తున్న ఘనత కార్యకర్తలది. ప్రధాని అయ్యే అవకాశం సోనియా గాంధీకి వచ్చినా కూడా పార్టీ కోసం త్యాగం చేసిన గొప్ప నాయకురాలు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా పనికి రారు. కాంగ్రెస్ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారంతో బురద జల్లుతున్నాయి. ప్రస్తుతం మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉంది. కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ఒకవైపు.. మరోవైపు రాష్ట్టాన్ని దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్‌లను ఓడించాలి. టీమ్ వర్క్ తోనే గెలుపు సాధ్యం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-09T18:29:07+05:30 IST