కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-05-20T05:48:06+05:30 IST
కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు

భూపాలపల్లి కలెక్టరేట్, మే 19: భగీరథ మహర్షి జయంతి వేడుకలు భూపాలపల్లి కలెక్టరేట్లో బుధవారం జరిగాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి ఇన్చార్జి కలెక్టర్ కృష్ణ ఆదిత్య పూలమాల వేసి నివాళులర్పించారు. కొవిడ్ నిబంధనల అనుసరించి జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి శైలజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ములుగు సంక్షేమ శాఖ కార్యాలయంలో..
ములుగు కలెక్టరేట్ : ములుగులోని జిల్లా సంక్షేమ భవనంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భగీరథుడి చిత్రపటానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎస్.లక్ష్మణ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.