భద్రాచలం-పాపికొండల టూర్ షురూ
ABN , First Publish Date - 2021-12-25T08:37:39+05:30 IST
ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదంగా గడపడానికి ఏపీలోని
![భద్రాచలం-పాపికొండల టూర్ షురూ](https://media.andhrajyothy.com/appimg/galleries/19211225314/12252021030732n24.jpg)
హైదరాబాద్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదంగా గడపడానికి ఏపీలోని పాపికొండల ప్రాంతం అద్భుత పర్యాటక కేంద్రమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. సుమారు రెండేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం పాపికొండల టూర్కు.. ప్యాకేజీలో భాగంగా బోటులో వెళ్లడానికి అనుమతించిందని ఆయన పేర్కొన్నారు. నగరం నుంచి వెళ్లే మొదటి బ్యాచ్ బస్సును బేగంపేట టూరిస్టు ప్లాజా నుంచి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.